కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే అవినీతి పరుడంటున్న ఆ పార్టీ శ్రేణులు...

ABN , First Publish Date - 2022-01-04T05:30:00+05:30 IST

కృష్ణా జిల్లా: కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు.

కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే అవినీతి పరుడంటున్న ఆ పార్టీ శ్రేణులు...

కృష్ణా జిల్లా: కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. పదవిని అడ్డుపెట్టుకుని రూ. 250 కోట్లు అవినీతికి పాల్పడ్డారని మాలమహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు ఆరోపించారు. అలాగే కొల్లూరులో 16 వందల ఎకరాలు బినామీ వ్యక్తులకు లీజుకిచ్చి రూ. 50 కోట్ల మేర లబ్దిపొందారని బీసీసెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినవారిని ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటును ఎస్సీ లేక బీసీలకు కేటాయించాలని, మళ్లీ నాగేశ్వరరావుకే ఇస్తే వైసీపీ ఓటమి తథ్యమని అసమ్మతి వర్గం నేతలు అన్నారు.

Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST