కృష్ణా జిల్లా: భవానీ దీక్షాపరుల వాహనం బోల్తా

ABN , First Publish Date - 2021-10-15T18:01:34+05:30 IST

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీ దీక్షాపరుల టాటా మినీ వాహనం బోల్తా పడింది.

కృష్ణా జిల్లా: భవానీ దీక్షాపరుల వాహనం బోల్తా

కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం, వీరవల్లి జాతీయ రహదారిపై భవానీ దీక్షాపరుల టాటా మినీ వాహనం బోల్తా పడింది. తణుకు నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి 20 మంది భవానీలు బయల్దేరారు. వీరవల్లి జాతీయ రహదారిపై భవానీలు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-15T18:01:34+05:30 IST