Gudivada రూరల్ మండలంలో గ్రామస్తుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-21T21:13:01+05:30 IST
గుడివాడ (Gudivada) రూరల్ మండలం, రామనపూడిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
Krishna జిల్లా: గుడివాడ (Gudivada) రూరల్ మండలం, రామనపూడిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయంలో అంబేద్కర్ (Ambedkar) చిత్రపటాన్ని తొలగించి.. ఆ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ (Jagan) ఫోటో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ సచివాలయంలో ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. గ్రామస్తుల ఆందోళనలతో, సీఎం జగన్ ఫోటో తీసివేసి తిరిగి యధాస్థానంలో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేశారు. ఐదేళ్లకోసారి మారే ముఖ్యమంత్రి ఫోటో కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు ఖండించారు.