రేపు కృష్ణాజిల్లాలో పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-03-09T15:56:20+05:30 IST

కృష్ణా జిల్లాలో బుధవారం పోలింగ్ జరగనుంది.

రేపు కృష్ణాజిల్లాలో పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

విజయవాడ: కృష్ణా జిల్లాలో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇందు కోసం పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రత్యేక పోలీస్ బలగాలతోపాటు అదనంగా మహిళా పోలీస్ సిబ్బందితో అన్ని రకాల పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. కృష్ణాజిల్లాలో ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 145 వార్డులకుగాను 140 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. వాటిలో 27 సెన్సిటీవ్, మరో 27 హైపర్ సెన్సిటీవ్‌గా గుర్తించామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 25 మంది ఇన్ స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, సున్నిత, అతి సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తారని రవీంద్రనాథ్ బాబు చెప్పారు. 

Updated Date - 2021-03-09T15:56:20+05:30 IST