కృష్ణా జిల్లాలో అమానవీయ ఘటన

ABN , First Publish Date - 2021-05-09T19:11:57+05:30 IST

కృష్ణా జిల్లా: ఉంగుటూరు మండలం, ముక్కపాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లాలో అమానవీయ ఘటన

కృష్ణా జిల్లా: ఉంగుటూరు మండలం, ముక్కపాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కనే రాజమహేంద్రవరపు చిట్టయ్య అనే వృద్ధుడిని బంధువులు వదిలేసి వెళ్లిపోయారు. గుడివాడ నుంచి చిట్టయ్యను ఆటోలో తీసుకువచ్చి గ్రామంలో వదిలేసి వెళ్లిపోయారు. భార్య, అతని కూతురు గ్రామంలో ఉన్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులైనా పట్టించుకుని వృద్ధుడిని ఆస్పత్రికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T19:11:57+05:30 IST