అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-03-01T05:35:42+05:30 IST
అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య
అద్దంకి, ఫిబ్రవరి 28: అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. పట్టణంలోని 2,3 వార్డుల పరిధిలోని కాకానిపాలెంలో ఆదివారం రాత్రి బాచిన కృష్ణచైతన్య ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా కృష్ణచైతన్య మాట్లాడుతూ ఓసీ కులాలలో ని పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం మూడు విడతలుగా 45 వేల రూపాయలు అ ందజేస్తుందన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యే యమన్నారు. అద్దంకి పట్టణంలో 2200 మం దికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. కా కానిపాలెంకు చెందిన మానికొ ండ నాగేశ్వరరావు, నాగరాజు, నరిశెట్టి కొండయ్య, గోరంట్ల శ్రీ హరి, గోరంట్ల గోపినాఽథ్,మానికొండ రాఘవ తదితరులు కు టుంబసభ్యులతో కలిసి కృష్ణచైతన్య సమక్షంలో వైసీపీలో చే రారు. ఈ కార్యక్రమంలో పట్టణపార్టీ అధ్యక్షు డు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ సందిరెడ్డి రమేష్, కోట శ్రీనివాసకుమార్, గోరంట్ల శ్రీనివాసరావు, కన్నెబోయిన వీరయ్య, రుద్రు కోటయ్య, సయినాల శ్రీనివాసరావు, నరిశెట్టి శ్రీధర్, అనిల్, గోరంట్ల శేఖర్, వైసీపీ అభ్యర్థులు కన్నెబోయున అనంతలక్ష్మి, వైకుంఠం సుబ్బాయమ్మ, బాలు పాల్గొన్నారు.