కత్తులు దూసిన కోళ్లు
ABN , First Publish Date - 2021-01-14T06:09:14+05:30 IST
జిల్లా వ్యాప్తంగా పందెంకోళ్లు కత్తులు దూశాయి.
జిల్లా వ్యాప్తంగా పందెంకోళ్లు కత్తులు దూశాయి. సంక్రాంతి పండుగ సంప్రదాయం ముసుగులో పందెం రాయుళ్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం కోడి పందేల బరులను ఏర్పాటు చేసి, అక్కడే పేకాట శిబిరాలను పెద్దఎత్తున నిర్వహించారు. పందేల బరుల వద్ద మద్యం అమ్మకాలు నిర్వహించారు. అధికశాతం కోడిపందేల బరులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ప్రారంభించారు. పోలీసులు అటు వైపునకు వచ్చినా వారిని వెనక్కు పంపేశారు. అధికార పార్టీ నాయకులు పోటీపడి మరీ పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించడంతో జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి.
- మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి