Krishna: పరిటాలలో రచ్చకెక్కిన వైసీపీ వర్గపోరు
ABN , First Publish Date - 2021-08-28T13:56:42+05:30 IST
కంచికచర్ల మండలంలోని పరిటాలలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. కంచికచర్ల మార్కెట్ చైర్మన్ భర్త మార్త శ్రీను, మాజీ చైర్మన్ మాగంటి అబ్బాయి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి
కృష్ణా : కంచికచర్ల మండలంలోని పరిటాలలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. కంచికచర్ల మార్కెట్ చైర్మన్ భర్త మార్త శ్రీను, మాజీ చైర్మన్ మాగంటి అబ్బాయి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మాగంటి కారుపై.. శ్రీను వర్గీయుల దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వర్గపోరు నెలకొంది. మాగంటి వర్గీయులు కంచికర్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. శ్రీను, ఆయన అనుచరులు దాడిచేశారని మాగంటి అబ్బాయి ఆరోపిస్తున్నారు. దీంతో ఇరువురూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వర్గపోరుతో పరిటాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.