విదేశీ విద్యా రుణ పథకానికి 19 కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2020-09-21T20:51:20+05:30 IST
వెనుకపడిన తరగుతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన
న్యూ ఢిల్లీ : వెనుకపడిన తరగుతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధులల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డాక్టర్ అంబేడ్కర్ పేరిట వడ్డీ రాయితో కూడిన విదేశీ విద్యా రుణాలను సమకూర్చే పథకానికి శ్రీకారం చుట్టినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ వెల్లడించారు. 2014-15 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ప్రతిభావంతులైన బీసీ, ఈబీసీ విద్యార్ధులకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించడం ద్వారా ఉపాధి మార్గాలను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం.
అయితే ఈ పథకం ఆరంభించిన మొదట్లో విద్యార్ధుల నుంచి ఆశించినంత స్పందన లేకపోవడంతో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువగా నిధుల విడుదల జరిగిందని మంత్రి చెప్పారు. 2017-18 నాటికి ఈ పథకం పట్ల విద్యార్ధులలో పెరిగిన అవగాహన కారణంగా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రుణాల మంజూరు జరిగినట్లు తెలిపారు.