కోయంబేడు Marketలో పెరిగిన రద్దీ

ABN , First Publish Date - 2022-02-19T13:39:54+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా శనివారం కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఆ మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కూరగాయలను కొనటానికి చిల్లరవ్యాపారులు, నగరవా

కోయంబేడు Marketలో పెరిగిన రద్దీ

చెన్నై: కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా శనివారం కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఆ మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కూరగాయలను కొనటానికి చిల్లరవ్యాపారులు, నగరవాసులు వేల సంఖ్యలో తరలివవచ్చారు. ఈ మార్కెట్‌కు శుక్రవారం వేకువజామున వివిధ ప్రాంతాల నుంచి 300లకు పైగా లారీల్లో కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సమయంలో ఉదయం నుంచే కూరగాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. నగరం నలుమూలల నుంచి చిల్లర వ్యాపారులు వ్యాన్లలో వచ్చి కూరగాయలను కొనుగోలు చేసుకుని వెళ్ళారు. శుక్రవారం సాయంత్రానికల్లా ఆ మార్కెట్‌లో ముప్పావు శాతం దుకాణాల్లో కూరగాయలు అమ్ముడైనట్లు వ్యాపారుల సంఘం నాయకులు తెలిపారు.

Updated Date - 2022-02-19T13:39:54+05:30 IST