తహసీల్దార్‌కు ‘కోయ’ కార్మికుల వినతి

ABN , First Publish Date - 2022-05-24T05:45:06+05:30 IST

తహసీల్దార్‌కు ‘కోయ’ కార్మికుల వినతి

తహసీల్దార్‌కు ‘కోయ’ కార్మికుల వినతి

కొత్తూర్‌, మే 23: న్యాయం చేయాలని కోరుతూ కోయ పరిశ్రమ కార్మికులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ రాములుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆకస్మత్తుగా పరిశ్రమను మూసివేస్తున్నట్లు పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిందని, పరిశ్రమలో ఉపాధి పొందుతున్న దాదాపు 100మంది కార్మికులు వీధినపడాల్సి వస్తుందని కార్మికులు వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కార్మికులు యాజమాన్యాన్ని  కోరితే దుర్భాషలాడుతున్నారని వాపోయారు. తమ సర్వీసును బట్టి సంవత్సరానికి 5నెలల వేతనం, రిటైర్మెంట్‌ దగ్గరలో ఉన్న కార్మికులకు 6నెలల వేతనం, కార్మిక చట్టం ప్రకారం కార్మికుల రావాల్సిన సదుపాయాలు కల్పించాలని కార్మికులు వినతి పత్రంలో కోరారు. 

Updated Date - 2022-05-24T05:45:06+05:30 IST