కొవిడ్-19 గర్భిణి ప్రసవం
ABN , First Publish Date - 2020-05-29T07:38:50+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడకు చెందిన కొవిడ్-19 పాజిటివ్ గర్భిణి(21) రాజానగరం జీఎ్సఎల్ ఆస్పత్రిలో
రాజానగరం, మే 28: తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడకు చెందిన కొవిడ్-19 పాజిటివ్ గర్భిణి(21) రాజానగరం జీఎ్సఎల్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ కోసం ఆమె ఇటీవలే పుట్టింటికి రాగా తల్లి, తండ్రి, సోదరుడితో పాటు ఆమెకూ కరోనా సోకింది. నిండు గర్భిణి కావడంతో ఈమెను ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య సేవలందించారు. గురువారం సిజేరియన్ చేసి బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.