కొవిడ్ వ్యాక్సిన్ విధిగా వేయించుకోవాలి
ABN , First Publish Date - 2022-01-17T05:39:52+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు.
ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్
గాజువాక, జనవరి 16: కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. గాజువాక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏడాదిలో 146 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని వివరించారు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయస్సు కలిగిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, స్థానిక నాయకులు పొలిమేర శ్రీను, రోహిణి, వర్రి లలిత, ములకలపల్లి ప్రకాశ్, నాగేశ్వరరావు, వెంకటరావు, రాజశేఖర్ పాల్గొన్నారు.