ఐఐటీహెచ్లో 123 మందికి కొవిడ్
ABN , First Publish Date - 2022-01-13T01:20:30+05:30 IST
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్లో 123 మంది సిబ్బంది, విద్యార్థులకు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలింది.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్లో 123 మంది సిబ్బంది, విద్యార్థులకు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలింది. వీరిలో 107 మంది విద్యార్థులు, ఏడుగురు ఫ్యాకల్టీ, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. తొలుత వీరిలో కొందరికి మూడు, నాలుగు రోజులుగా జలుబు, జ్వరం వచ్చినట్టు తెలియడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రి సిబ్బంది ర్యాట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 123 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఐఐటీహెచ్ భవనంపై అంతస్తులో హాస్టల్ గదులలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి, ఉంచారు. స్వల్ప లక్షణాలతో ఉన్న వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు. మిగిలిన సిబ్బందికి, విద్యార్థులకు కూడా అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు గురువారం వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.