పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
ABN , First Publish Date - 2020-03-29T09:26:41+05:30 IST
కోవిడ్ - 19 వైర స్ కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విపత్కర పరిస్థి తులలో పోలీసు వ్యవస్థకు ప్రజల నుంచి సహ కారం అందించాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏ సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీ రావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు శని వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఏపీ జేఏసీ అమరావతి నేతలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కోవిడ్ - 19 వైర స్ కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విపత్కర పరిస్థి తులలో పోలీసు వ్యవస్థకు ప్రజల నుంచి సహ కారం అందించాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏ సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీ రావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు శని వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రమాద కర పరిస్థితులలో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగుల కు ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తుందని తెలిపారు. పోలీసులు, వైద్య - ఆరోగ్య సిబ్బంది త మ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహి స్తున్నారని, ప్రజలు వారికి అండగా నిలబడి సవ్యంగా విధులు నిర్వహించుకునేలా సహకరిం చాలన్నారు.
వేలాదిమంది పోలీసులు కుటుంబా లకు దూరంగా ఉంటున్నారని ఇంటికి వెళితే కు టుంబ సభ్యులకు తాము వైరస్ను అంటిస్తామే మోనన్న ఉద్దేశంతో రాత్రి, పగలు లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో అస త్య ప్రచారాలను చేస్తే పోలీసుల మానసిక స్థైర్యా న్ని దెబ్బతీసినట్టు అవుతుందని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నతాధికారు లు కూడా సమగ్ర విచారణలు లేకుండా సోషల్ మీడియాలో వస్తున్నాయని తొందరపడి ఎలాం టి చర్యలు తీసుకోవద్దని కోరారు.