అన్నీ ప్రభుత్వమే ఇవ్వడం కష్టం

ABN , First Publish Date - 2022-05-15T08:26:46+05:30 IST

అన్నీ ప్రభుత్వమే ఇవ్వడం కష్టం

అన్నీ ప్రభుత్వమే ఇవ్వడం కష్టం

ఇళ్ల లబ్ధిదారులూ ముందుకురావాలి: మంత్రి కొట్టు 


బాపట్ల, మే 14 (ఆంధ్రజోతి): గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారులు కూడా ముందుకురావాలని, అన్నీ ప్రభుత్వమే సమకూర్చాలంటే కష్టమని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. గృహ నిర్మాణాలలో బాపట్ల జిల్లా వెనుకంజలో ఉందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందన్నారు. రబీ ఽధాన్యం సేకరణతో పాటు చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగానే నీరు విడుదల చేసి ఖరీఫ్‌ సాగును ముందుకు తీసుకురావడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. 

Updated Date - 2022-05-15T08:26:46+05:30 IST