అభివృద్ధి ప్రధాత బాలయోగి

ABN , First Publish Date - 2020-10-02T09:13:26+05:30 IST

లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి అభివృద్ధి ప్రధాత అని కొత్తపేట టీడీపీ నేతలు పేర్కొన్నారు.

అభివృద్ధి ప్రధాత బాలయోగి

కొత్తపేట, అక్టోబరు 1: లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి అభివృద్ధి ప్రధాత అని కొత్తపేట టీడీపీ నేతలు పేర్కొన్నారు. గురువారం బాలయోగి జయంతిని పురస్కరించుకుని స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కోనసీమవాసులకు బాలయోగి సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల రామకృష్ణ, ముత్యాల బాబ్జీ, కంఠంశెట్టి శ్రీనివాసరావు, గుబ్బల మూర్తి, పల్లికొండ సుధీర్‌, మిద్దే ఆదినారాయణ, అద్దంకి చంటిబాబు, బొరుసు సత్తిబాబు, నిమ్మకాయల చిన్నయ్య పాల్గొన్నారు.


ఆత్రేయపురం: భారత లోక్‌సభాపతి స్వర్గీయ జీఎంసీ బాలయోగి జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం ఆత్రేయపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు ఆధ్వర్యంలో బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వివిధ గ్రామాల్లో ముళ్లపూడి భాస్కరరావు, కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలింగి రవిచంద్ర, ముదునూరి సుబ్బరాజు, గార్లపాటి గోపి, మద్దింశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  


ఘనంగా బాలయోగి జయంతి

రావులపాలెంరూరల్‌, అక్టోబరు 1: లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, గ్రామ అధ్యక్షుడు పడాల బులికొండారెడ్డి, మేడపాటి కాసురెడ్డి, పోతుమూడి సత్యనారాయణ తదితరులు బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2020-10-02T09:13:26+05:30 IST