‘కొత్త వలస’ పంచాయితీ తేల్చండి.. లోకేశ్ ట్వీట్

ABN , First Publish Date - 2021-02-23T20:45:10+05:30 IST

జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం

‘కొత్త వలస’ పంచాయితీ తేల్చండి.. లోకేశ్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం వైఎస్ జనగ్ తొక్కని అడ్డదారులు లేవని విమర్శించారు. అధికార మదంతో అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామ పంచాయతీలో టిడిపి బలపర్చిన అభ్యర్థి 260 ఓట్ల గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైకాపా గెలిచినట్టు ప్రకటించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కొంతమంది అధికారులు ఖూనీ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. చీకటి మాటున గెలిచామని ప్రకటించుకున్నా పగలు ధైర్యంగా జనాల్లో తిరగలేని పరిస్థితి వైకాపా నాయకులదన్నారు. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆధారాలు పరిశీలించి రీ-కౌంటింగ్‌కి ఆదేశించాలన్నారు. 




Updated Date - 2021-02-23T20:45:10+05:30 IST