Kurnool: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టు పనులు పూర్తి: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య

ABN , First Publish Date - 2022-05-16T18:32:22+05:30 IST

తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చెప్పారు.

Kurnool: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టు పనులు పూర్తి: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య

కర్నూలు: తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల (Project) ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla) చెప్పారు. కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించడంతో పాటు ఆలూరులో టమోటా ఫాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గడప గడప వైసీపీ కార్యక్రమంలో పాల్గొనే ధైర్యం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. పోలీసుల సాయం తీసుకుని వెళ్లడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చేందుకు జగన్ అపుడు ముద్దులు పెడితే ఇపుడు గుద్దులు పెడుతున్నాడని విమర్శించారు. వైసీపీని నమ్మి మోసపోవద్దని కోట్ల సూర్య ప్రజలను కోరారు.  

 

Updated Date - 2022-05-16T18:32:22+05:30 IST