31న శ్రీకూర్మంలో కోటితులసీ దళార్చన
ABN , First Publish Date - 2021-10-23T05:16:14+05:30 IST
ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీకూర్మంలో ఈ నెల 31న విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచారసేవాసంఘం ఆధ్వర్యంలో కోటి తులసీ దళార్చన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సునీతామధుసూదన్ తెలిపారు.
గార: ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీకూర్మంలో ఈ నెల 31న విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచారసేవాసంఘం ఆధ్వర్యంలో కోటి తులసీ దళార్చన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సునీతామధుసూదన్ తెలిపారు. శుక్రవారం శ్రీకూర్మక్షేత్రంలో ఈవో ఎస్.విజయకుమార్, విశ్వహిందూ పరిషత్ జిల్లాకార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు, ఆలయ అర్చకులతో కలిసి కోటితులసీ దళార్చన గోడపత్రికను ఆవిష్కరించారు.