బీజేపీలో ఈటల కొనసాగడంపై అనుమానమే: మంత్రి కొప్పుల
ABN , First Publish Date - 2021-11-05T23:29:25+05:30 IST
దళితబంధును ఆపిందే బీజేపీనే అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బండి సంజయ్ ఏ అర్హతతో దళితబంధుపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్: దళితబంధును ఆపిందే బీజేపీనే అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బండి సంజయ్ ఏ అర్హతతో దళితబంధుపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉపఎన్నిక కోసం మ్యానిఫెస్టో రిలీజ్ చేయటం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఉపఎన్నిక ఫలితంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు. బీజేపీలో ఈటల కొనసాగడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. హుజురాబాద్లో బీజేపీ, కాంగ్రెస్లు కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఉపఎన్నిక ఫలితాలు తమ పాలనకు రిఫరెండం కాదన్నారు.