కేసీఆర్‌ది అసమర్థ పాలన: కూనంనేని

ABN , First Publish Date - 2021-12-17T20:22:23+05:30 IST

తెలంగాణలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదని కూనంనేని సాంబశివ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసీఆర్‌ది అసమర్థ పాలన: కూనంనేని

ఖమ్మం: తెలంగాణలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో జరగట్లేదని, సిద్దిపేట రాష్ట్రంలో ఒక భాగం మాత్రమేనని చెప్పారు. కేసీఆర్ పాలనలో వడ్లు కొనని పరిస్థితి దాపురించిందన్నారు.అందుకే రైతులు మరణిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అసమర్థ పాలన నడుస్తుందన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పాలిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ రంగలకు అప్పగిస్తుందని కూనంనేని సాంబశివ రావు చెప్పారు. 

Updated Date - 2021-12-17T20:22:23+05:30 IST