జగన్ రెడ్డి అభినవ నీరోచక్రవర్తి: కూన రవికుమార్

ABN , First Publish Date - 2021-06-12T19:47:46+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డి అభినవ నీరోచక్రవర్తి అని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.

జగన్ రెడ్డి అభినవ నీరోచక్రవర్తి: కూన రవికుమార్

అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి అభినవ నీరోచక్రవర్తి అని తెలుగుదేశ సీనియర్ నేత,  మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా కారణంగా చితికిపోయిన పేదకుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం రూ.10లక్షలివ్వాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం చేయాలని,  ఉచితంగా సరుకులు అందించాలని కూన రవికుమార్ కోరారు. 

Updated Date - 2021-06-12T19:47:46+05:30 IST