‘కూ’ వినియోగదారులు కోటి

ABN , First Publish Date - 2021-08-28T05:57:09+05:30 IST

దేశీ మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘కూ’ యూజర్ల సంఖ్య కోటికి చేరుకుంది. ఈ సంఖ్య వచ్చే ఏడాది నాటికి పది కోట్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని ‘కూ’ కో ఫౌండర్‌ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ గ్రోత్‌ బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదని చెబుతున్నారు. ..

‘కూ’ వినియోగదారులు కోటి

దేశీ మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘కూ’ యూజర్ల సంఖ్య కోటికి చేరుకుంది. ఈ సంఖ్య వచ్చే ఏడాది నాటికి పది కోట్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని ‘కూ’ కో ఫౌండర్‌ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ గ్రోత్‌ బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదని చెబుతున్నారు. వాస్తవానికి ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో రెండు శాతం మంది మాత్రమే తమ భావాలను తెలుపుకొనేందుకు మైక్రోబ్లాగింగ్‌ వేదికలను ఉపయోగిస్తూ ఉంటారు.


 మన దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో  98 శాతం మందికి   మైక్రోబ్లాగింగ్‌ వేదికలపై అవగాహనే లేదు. వారిని లక్ష్యంగా చేసుకుని విస్తరణ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ‘ట్విట్టర్‌’కు పోటీగా ఆరంభమైన ‘కూ’, 15-16 నెలల్లోనే ఒక కోటి వినియోగదారుల మార్కును చేరుకోగలిగింది. మన దేశంలో సుమారు 70 కోట్ల మంది ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు.  వారందరికీ తమవైన అభిప్రాయాలు ఉంటాయి. వారందరికీ ‘కూ’ని పరిచయం చేయగలిగితే బేస్‌ పెరుగుతుందని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో కూ సపోర్ట్‌ చేస్తోంది

Updated Date - 2021-08-28T05:57:09+05:30 IST