ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
ABN , First Publish Date - 2021-04-13T05:51:25+05:30 IST
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వైరా సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్ స్పష్టం చేశారు.
మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్చైర్మన్ రాజశేఖర్
వైరా, ఏప్రిల్ 12: సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వైరా సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్ స్పష్టం చేశారు. సోమవారం వైరా సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు, రైతుబంధు సభ్యులు, ఏఈవోలు, సిబ్బందితో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 421కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచనలతో వైరాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 14న ఖానాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారని తెలిపారు. రైతుబంధు జిల్లా సభ్యుడు మచ్చా నర్సింహారావు, జడ్పీకోఆప్షన్ సభ్యుడు షేక్.లాల్మహ్మద్, సొసైటీ సీఈవో డేరంగుల నర్సింహారావు, ఉపాధ్యక్షుడు కొణిధన కోటేశ్వరరావు, డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వరరావు, యన్నం వెంకటకోటారెడ్డి, బొల్లెపోగు శ్రీను, తాతా బసవయ్య, వనమా చిన్నసత్యనారాయణ, పసుపులేటి హన్మంతరావు, కొరివి కొండలరావు పాల్గొన్నారు.