టైటిల్‌కు చేరువలో హంపి బృందం

ABN , First Publish Date - 2022-08-09T09:50:48+05:30 IST

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి సారథ్యంలోని భారత మహిళల జట్టు 44వ చెస్‌ ఒలింపి యాడ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

టైటిల్‌కు చేరువలో హంపి బృందం

చెన్నై (ఆంధ్రజ్యోతి): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి సారథ్యంలోని భారత మహిళల జట్టు 44వ చెస్‌ ఒలింపి యాడ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సోమవారం 10వ రౌండ్‌ ముగిసేసరికి హంపి బృందం 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలి చింది. పదోరౌండ్‌ పోటీల్లో హంపి, తానియా, కులకర్ణి అద్భుత విజయాలు సాధించగా. వైశాలి డ్రా చేసుకోవడంతో భారత్‌ 3.5-0.5తో కజకిస్థాన్‌పై గెలిచింది. మంగళవారం జరగనున్న ఆఖరి రౌండ్‌లో హంపి బృందం గెలిస్తే టైటిల్‌ సొంతమవు తుంది. మహిళల విభాగంలోని భారత్‌-2 టీమ్‌ 15పాయింట్లతో 6వ స్థానంలో, భారత్‌-3 జట్టు 9వ స్థానంలో నిలిచాయి.


భారత్‌-2 జట్టు 3-1తో నెదర్లాం డ్స్‌పై, భారత్‌-3 టీమ్‌ 3-1తో స్వీడన్‌పై నెగ్గాయి. పురుషుల్లో హరికృష్ణ నేతృత్వంలోని భారత జట్టు 2.5- 1.5తో ఇరాన్‌పై నెగ్గింది. భారత్‌-2 టీమ్‌ 2-2తో ఉజ్బెకిస్థాన్‌తో డ్రా చేసుకొని పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 3వ స్థానంలో నిలిచింది. ఇక, భారత్‌-3 జట్టు 2-2తో స్లోవేకియాతో డ్రా చేసుకుని 28వ స్థానంలో ఉంది. ఉజ్భెకిస్థాన్‌ టాప్‌లో ఉంది. 

Updated Date - 2022-08-09T09:50:48+05:30 IST