డీఎంహెచ్‌వోగా కొండయ్య

ABN , First Publish Date - 2022-05-27T04:57:06+05:30 IST

అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్‌ ఎన్‌.కొండయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు.

డీఎంహెచ్‌వోగా కొండయ్య
బాధ్యతలు చేపడుతున్న డాక్టర్‌ కొండయ్య

రాయచోటి టౌన్‌, మే 26: అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్‌ ఎన్‌.కొండయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్న నాగరాజు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యులతో పాటు వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, పారా మెడికల్‌ ఉద్యోగులు అందరూ సమిష్టిగా పనిచేసి వైద్య రంగంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొండయ్యను వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో వైద్యశాఖాధికారులు నాగరాజు, వెంకటశివ, వైద్యాధికారులు మధుసూదన్‌రెడ్డి, రియాజ్‌బేగ్‌, విష్ణు, సబ్‌ యూనిట్‌ అధికారి ప్రసాద్‌, డిప్యూటీ డెమో దేవశిరోమణి, హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ వెంకటరెడ్డి, బలరామరాజు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:57:06+05:30 IST