కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-05-29T14:11:16+05:30 IST
సిద్దిపేట: నేటి తెల్లవారుజామునే సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సిద్దిపేట: నేటి తెల్లవారుజామునే సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నేడు కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం దంపతులు ఛండీయాగం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న ఎర్రవల్లి ఫాంహౌస్కు కేసీఆర్ వెళ్లనున్నారు. తిరిగి 10 గంటలకు కొండపోచమ్మసాగర్ పంప్హౌజ్కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సుదర్శన యాగంలో చినజీయర్ స్వామితో కలిసి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు.