కొండపోచమ్మ సాగర్ కుడికాలువకు గండి
ABN , First Publish Date - 2020-07-01T00:14:27+05:30 IST
కొండపోచమ్మ సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడి కాలువకు గండి పడింది. మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం ...
సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడి కాలువకు గండి పడింది. మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండి పడటంతో గ్రామంలోకి నీరు చేరింది. ఉదయం 7 గంటల సమయంలో కాలువకు గండి పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పొలాలు, కూరగాయల తోటల్లోకి నీరు చేరినట్లు చెప్పారు. ఉదయం కావడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో అధికారులు నీటిని నిలిపివేశారు.