AP: కొండపల్లికి బయలుదేరిన టీడీపీ వార్డు సభ్యులు
ABN , First Publish Date - 2021-11-22T14:56:32+05:30 IST
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నకిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఉదయం టీడీపీ శిబిరం నుంచి ఎం.పి కేశినేని నాని నేతృత్వంలో టీడీపీ వార్డు సభ్యులు కొండపల్లికి బయలుదేరారు.
విజయవాడ: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నకిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఉదయం టీడీపీ శిబిరం నుంచి ఎం.పి కేశినేని నాని నేతృత్వంలో టీడీపీ వార్డు సభ్యులు కొండపల్లికి బయలుదేరారు. పోలీసు ఎస్కార్ట్ సహాయంతో కేశినేని నాని బయలుదేరారు. టీడీపీ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక బస్సులో కొండపల్లికి పయనమయ్యారు. వార్డు సభ్యులతో ఎన్నిక విషయంలో ఎలా అనుచరించాలి అనే అంశాన్ని కేశినాని వివరించారు. మరోవైపు కొండపల్లి మున్సిపల్ కార్యాలయం పోలీసులు వలయంలో ఉంది. ఆ మార్గంలో ఎవరూ రాకుండా ముళ్ల కంచెలతో ఆంక్షలు విధించారు. మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. సభ్యులు ఫోన్లు సైతం బయటే ఉంచాలని నిబంధన పెట్టారు. మున్సిపల్ కార్యాలయం రోడ్లోకి కూడా మీడియాను అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ, వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు చేసుకున్నాయి.