కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు
ABN , First Publish Date - 2021-12-22T22:57:13+05:30 IST
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వాదనలు వినబోనని జడ్జి స్పష్టం చేశారు.
అమరావతి: కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వాదనలు వినబోనని జడ్జి స్పష్టం చేశారు. కేసు విచారణను మరో బెంచ్కి పంపాల్సిందిగా.. సీజేకి సమాచారం జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ పంపారు. బుధవారం కేసు విచారణ సందర్భంగా కొండపల్లి కౌన్సిలర్ల తరపు న్యాయవాది, బెంచ్తో వాదనకు దిగడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేసి వెళ్లారు. భోజన విరామం అనంతరం కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. కారణాలను రికార్డ్ చేయాలని ఎంపీ కేశినేని నాని తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ కోరారు. కారణాలను రికార్డ్ చేస్తున్నానని చెప్పి కేసు నుంచి తప్పుకుంటున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.