AP: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వివాదం

ABN , First Publish Date - 2021-11-22T17:25:30+05:30 IST

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది.

AP: కొండపల్లి మున్సిపల్  ఛైర్మన్ ఎన్నిక వివాదం

విజయవాడ: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. కార్యాలయం లోపలకు చొచ్చుకెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపైనే కార్యకర్తలు తిరగబడ్డారు. దొంగ ఓట్ల కేశినేని నాని అంటూ వైసీపీ నినాదాలు చేసింది. కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీకి న్యాయం జరగాలంటూ నిరసనకు దిగారు. కౌన్సిల్ హాలులో వాగ్వాదం జరిగిన వెంటనే బయట గొడవ మొదలైంది. 

Updated Date - 2021-11-22T17:25:30+05:30 IST