భారీ భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి వార్డు సభ్యులు

ABN , First Publish Date - 2021-11-24T15:25:19+05:30 IST

భారీ భద్రత నడుమ ఎంపీ కేశినేని నాని సహా వార్డు సభ్యులను పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

భారీ భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి వార్డు సభ్యులు

విజయవాడ: భారీ భద్రత నడుమ ఎంపీ కేశినేని నాని సహా వార్డు సభ్యులను పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కొండపల్లిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. వార్డు సభ్యుల బస్సులో వస్తున్న మీడియా సిబ్బందిని కూడా మార్గమధ్యలోనే దించివేశారు. పోలీసుల వలయంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. కొండపల్లిలో స్థానికులకు కూడా పోలీసుల ఆంక్షలు తప్పని పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆంక్షలు వర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 

Updated Date - 2021-11-24T15:25:19+05:30 IST