కొండమల్లేపల్లి వైన్స్షాపులో చోరీ
ABN , First Publish Date - 2020-07-06T11:04:52+05:30 IST
మండల కేంద్రం పశువుల సంత సమీపంలో శ్రీలక్ష్మీ వైన్స్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.10వేల విలువైన మద్యం సీసాలు
కొండమల్లేపల్లి/ పెద్దఅడిశర్లపల్లి, జూలై 5: మండల కేంద్రం పశువుల సంత సమీపంలో శ్రీలక్ష్మీ వైన్స్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.10వేల విలువైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు ఏఎ్సఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వైన్స్షాపు వెనక నుంచి గోడ తవ్వి లోపలికి ప్రవేశించి మద్యం ఎత్తుకెళ్లారని ఏఎ్సఐ తెలిపారు. పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్రోడ్డులో గల చికెన్ సెంటర్లో 30వేలు ఎత్తుకెళ్లారు.