రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదు: కొండా సురేఖ

ABN , First Publish Date - 2021-04-16T21:31:43+05:30 IST

రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. నగరంలో జరిగిన పార్టీ

రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదు: కొండా సురేఖ

వరంగల్: రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. నగరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరూ కూడా అమ్ముడుపోవద్దని ఆమె అన్నారు. "మీరు అమ్ముడుపోతే కన్నతల్లిని అమ్ముకున్నట్టే, మీ గెలుపునకు మేము కృషి చేస్తాం, మేమే ఖర్చు భరించి గెలిపిస్తామని" అని సురేఖ పేర్కొన్నారు. అభ్యర్థులు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని సురేఖ సూచించారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఈ ఎన్నికలే పునాది అని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు కొవిడ్ విజృంభిస్తుంటే మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టారని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతోనే కరోనా టైమ్‌లో ఎన్నికలు పెట్టారని సురేఖ విమర్శించారు. 

Updated Date - 2021-04-16T21:31:43+05:30 IST