‘ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహిస్తాం’
ABN , First Publish Date - 2021-04-06T17:12:16+05:30 IST
‘ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహిస్తాం’
ఖమ్మం: కరోనా సాకుతో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహిస్తామని వైఎస్ షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు. పోలీసులు తమ సభకు వచ్చే వారికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఖమ్మం గడ్డపై అడుగుపెడితే ఎవరికి వణుకు పుడుతుందో అర్ధం కావడం లేదన్నారు.