కొండా లక్ష్మణ్ బాపూజీ...తెలంగాణా శక్తి

ABN , First Publish Date - 2020-09-27T22:39:16+05:30 IST

తెలంగాణ ఆవిర్భాభవమే ఆశయంగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్వప్నించిన తెలంగాణ శక్తి,గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ పద్మశాలి అఫిషియల్ ,స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ...తెలంగాణా శక్తి

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భాభవమే ఆశయంగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్వప్నించిన తెలంగాణ శక్తి,గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ పద్మశాలి అఫిషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నారాయణ గూడా రాజ్ మోహళ్ళ పద్మశాలి భవన్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆలోచనకు బీజం వేసిన వ్యక్తి గానే గాక, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక మంత్రినవుతా అని తన మంత్రి పదవికి రాజీనామా చేసిన అరుదైన ఘనత ను తెలంగాణా చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేసిన తెలంగాణ సమర యోధుడు బాపూజీ అని ఆయన అన్నారు.


అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల సహదేవ్, మాట్లాడుతూ..తెలంగాణా మాత్రమే గాక యావత్ తెలుగు జనం ఎన్నటికీ మరవని నాయకుకుడు కొండా లక్ష్మణ్ అని అభివర్ణించారు. సహాథ్యక్షులు శిరందాస్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలను కలిగి ఇప్పటికీ రాజకీయాలకు అతీతంగా  తనను స్మరించుకునే లా చేసిన ధన్యుడు బాపూజీ అన్నారు.


రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ ఐతే, తెలంగాణ జాతి పిత కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం టీ ఆర్ ఎస్ కార్యాలయం కోసం తన ఇంటినే అర్పించిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు.

Updated Date - 2020-09-27T22:39:16+05:30 IST