కోనసీమ రైల్వేలైన్‌ సత్వరం పూర్తిచేయాలని వినతి

ABN , First Publish Date - 2022-01-29T04:38:18+05:30 IST

కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌ నిర్మాణ పనులు ఎటు వంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు తగిన చ ర్యలు తీసుకోవాలని కోరుతూ కోనసీమ రైల్వే సాధనసమితి ప్రతినిధులు అమలాపురం ఎంపీ చింతా అనురాధకు వినతిపత్రం అం దజేశారు.

కోనసీమ రైల్వేలైన్‌ సత్వరం పూర్తిచేయాలని వినతి

అమలాపురంటౌన్‌, జనవరి 28: కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌ నిర్మాణ పనులు  ఎటు వంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు తగిన చ ర్యలు తీసుకోవాలని కోరుతూ కోనసీమ రైల్వే సాధనసమితి ప్రతినిధులు అమలాపురం ఎంపీ చింతా అనురాధకు వినతిపత్రం అం దజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.800 కోట్లకుపైగా నిధులు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేసేలా చొరవ తీసుకోవడంతోపాటు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కేంద్ర బడ్జెట్‌లో కోనసీమ రైల్వేలైన్‌ కు నిధులు కేటాయించేందుకు రైల్వేశాఖ మంత్రితో చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కేఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఇఆర్‌ సుబ్రహ్మణ్యం, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కల్వకొలను  తాతాజీ, సప్పా నాగేశ్వరరావు, యలగర్త వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T04:38:18+05:30 IST