కోనసీమ జిల్లాలో Road accident..
ABN , First Publish Date - 2022-06-17T13:30:22+05:30 IST
కొత్తపేట మండలం, మందపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
Konaseema జిల్లా: కొత్తపేట మండలం, మందపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. బైక్ను పాలవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కుమారుడు నాయనమ్మ ఉన్నారు. కొత్తపేట నుంచి రావులపాలెం మండలం, కొమరాజులంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు అప్పన మహేష్(20), అప్పన వెంకటలక్ష్మి(40), అప్పన సత్యవతి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.