టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే బందరుకు మంచి భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-03-04T06:58:41+05:30 IST

మచిలీపట్నం కార్పొ రేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే మచిలీపట్నంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాజీ ఎంపీ, మచిలీ పట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారా యణరావు అన్నారు.

టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే బందరుకు మంచి భవిష్యత్తు
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం టౌన్‌, మార్చి 3 : మచిలీపట్నం కార్పొ రేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే మచిలీపట్నంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాజీ ఎంపీ, మచిలీ పట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారా యణరావు అన్నారు. బుధవారం ఆయన జడ్పీ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఎన్ని ఒత్తిడులు చేసినా టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ విజయం సాధిస్తా రన్నారు. ఓటర్లను వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తు న్నారన్నారు. 39వ డివిజన్‌లో వైసీపీ నాయకులు ఓటర్లను ప్రలోభపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వైసీపీ నాయకులు వినియోగించుకుంటున్నారన్నారు. వలంటీర్లు ఓటర్ల స్లిప్పులు పంచవద్దని ఎన్నికల కమిషన్‌ చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మచిలీపట్నంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, టీడీపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్‌ బొడ్డు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-04T06:58:41+05:30 IST