కొమురం భీం జిల్లా వాసులను హడలెత్తిస్తున్న ఏ2 పులి
ABN , First Publish Date - 2021-02-25T13:39:36+05:30 IST
జిల్లా వాసులను ఏ2 పులి హడలెత్తిస్తోంది. పెంచికల్ పేట - బెజ్జూరు - దహేగం మండలాల్లో పులి స్వైర విహారం చేస్తోంది.
కొమురం భీం: జిల్లా వాసులను ఏ2 పులి హడలెత్తిస్తోంది. పెంచికల్ పేట - బెజ్జూరు - దహేగం మండలాల్లో పులి స్వైర విహారం చేస్తోంది. నందిగాం అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. దిగిడ వైపు వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులి సంచారంతో 35 అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.