కొమురయ్య వర్ధంతిని అధికారికంగా జరపాలి

ABN , First Publish Date - 2022-07-03T06:00:08+05:30 IST

కొమురయ్య వర్ధంతిని అధికారికంగా జరపాలి

కొమురయ్య వర్ధంతిని అధికారికంగా జరపాలి

ఇబ్రహీంపట్నం, జూన్‌ 2: తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మల్లే్‌షలు డిమాండ్‌ చేశారు. శనివారం ఇబ్రహీంపట్నంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రెండవ విడతలో డీడీలు కట్టినా సగం మందికే గొర్రెలు పంపిణీ చేశారని మిగిలిన వారికి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా హైనాల దాడిలో గొర్రెలను కోల్పోయిన కాపరులకు ప్రభుత్వపరంగా పరిహారం అందించాలని కోరారు. గొర్రెల కాపరులపై అటవీ అధికారుల వేధింపులను ఆపాలన్నారు. సంఘ నాయకులు రావుల జంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బర్ల మల్లేష్‌ కృష్ణ, పెంటయ్య ఉన్నారు.

Updated Date - 2022-07-03T06:00:08+05:30 IST