పట్నం మహేందర్ రెడ్డికి అవమానం జరిగింది: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-28T18:20:37+05:30 IST

పట్నం మహేందర్ రెడ్డి ఎపిసోడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పట్నం మహేందర్ రెడ్డికి కోమటిరెడ్డి మద్దతు పలికారు.

పట్నం మహేందర్ రెడ్డికి అవమానం జరిగింది: కోమటిరెడ్డి

హైదరాబాద్ : పట్నం మహేందర్ రెడ్డి ఎపిసోడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పట్నం మహేందర్ రెడ్డికి కోమటిరెడ్డి మద్దతు పలికారు. పట్నం మహేందర్ రెడ్డికి అవమానం జరిగిందని.. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ అని పేర్కన్నారు. ఇంకా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా..? డీజీపీ... ఉన్నా లేనట్టే పోలీసుల రాజ్యం తయారైంది. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా? ఎమ్మెల్యేకి ఐదు ఎస్కార్ట్ వాహనాలు అవసరమా..? పోలీసులు వీటి మీద స్పందించాలి. పట్నం మహేందర్ బూతులు తిట్టారు తప్పే కానీ పోలీసుల పద్ధతి కూడా మారాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-04-28T18:20:37+05:30 IST