జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోంది: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-04-18T20:15:25+05:30 IST

జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోందని.. గతంలో బీసీలకు అన్నిరంగాల్లో టీడీపీ పెద్దపీట వేసిందని టీడీపీ ఏపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు.

జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోంది: కొల్లు రవీంద్ర

కర్నూలు: జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోందని.. గతంలో బీసీలకు అన్నిరంగాల్లో టీడీపీ పెద్దపీట వేసిందని టీడీపీ ఏపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం శ్రీ క్రిష్ణ దేవరాయ ధర్నా‌చౌక్ లో  మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో  కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవన ఉపాధిపై దెబ్బకొట్టే 217 జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అన్నిరంగాల్లోని బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. పేరుకే బీసీ మంత్రులు..  కేబినెట్‌లో ఏమాత్రం పవర్ లేనందున బీసీలకు మంత్రులు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పారు. జగన్ భజన చేసే వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. సొంత కాళ్లపై బతికే మత్య్సకారులను జగన్ రోడ్డున బిచ్చమెత్తుకునేలా చేశారని ధ్వజమెత్తారు. త్వరలో ఈ ఉద్యమాన్ని విజయవాడ, విశాఖ కేంద్రంగా తీవ్రతరం చేయబోతున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ దీక్షలో టీడీపీ  ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ దీక్షకు మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-04-18T20:15:25+05:30 IST