అందుకే అచ్చెన్నపై ప్రభుత్వం కుట్ర: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2020-02-21T21:28:59+05:30 IST

అమరావతి: వైసీపీ ప్రభుత్వం బలహీనవర్గాలకు అన్యాయం చేస్తోందని..

అందుకే అచ్చెన్నపై ప్రభుత్వం కుట్ర: కొల్లు రవీంద్ర

అమరావతి: వైసీపీ ప్రభుత్వం బలహీనవర్గాలకు అన్యాయం చేస్తోందని, వారిని అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీనవర్గాలకు చెందిన నాయకులను..ఏదో ఒక స్కాంలో ఇరికించాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయనపై ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యమిస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


వైసీపీ నేతలపై ఉన్న కేసులను దారి మళ్లించేందుకే.. అచ్చెన్నాయుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ఇది ఏపీలోని బలహీనవర్గాలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. సంస్థలే లేకుండా మందులు కొనుగోలు చేశారని.. అచ్చెన్నాయుడిపై ఎలా ఆరోపణలు చేస్తారని కొల్లు రవీంద్ర వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఇది ఒక్క అచ్చెన్నాయుడుపై జరుగుతున్న దాడిగా తాము భావించడం లేదని, రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అందరిపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని, దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - 2020-02-21T21:28:59+05:30 IST