-
-
Home » Andhra Pradesh » kollu ravindra cm jagan ycp-MRGS-AndhraPradesh
-
రాక్షసుడు జగన్ పాలనలో కోడెల ప్రాణాలు తీసుకున్నారు: కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2022-05-03T01:38:47+05:30 IST
రాక్షసుడు జగన్ పాలనలో కోడెల ప్రాణాలు తీసుకున్నారు: కొల్లు రవీంద్ర
విజయవాడ: రాక్షసుడు జగన్మోహనరెడ్డి పాలనలో కోడెల ప్రాణాలు తీసుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నవరత్నాలు పేరుతో ప్రజల వద్ద నవరసాలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆడ బిడ్డలకు స్వేచ్చ లేదని, రాష్ట్రంలో జరిగిన ఘటలను భాద్యతగా తీసుకుని హోమ్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్లిన లోకేష్పై దాడి హేయమైన చర్య అన్నారు. వైసీపీ ఎమ్మెల్ హస్తంతో వైసీపీ కార్యకర్త గోపాలపురములో దారుణ హత్యకు గురి అయ్యాడు అని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడలేని మంత్రులు పాలన చేస్తున్నారని విమర్శించారు. గంట, అరగంట, మాట్లాడే మంత్రులుతో ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రన్ని అన్ని విధాలుగా దోచుకుంటున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు.