టీడీపీ నాయకులపై కేసు నమోదు అమానుషం : కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2021-02-28T07:19:48+05:30 IST
టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 27 : టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. నూతనంగా ఎన్నికైన గోపువానిపాలెం సర్పంచ్ వాలిశెట్టి చంద్రరేఖ, మాజీ సర్పంచ్ వాలిశెట్టి వెంకటేశ్వరరావు (బాబు)తో కలిసి కొల్లు రవీంద్ర శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల రోజున చంద్రరేఖ ర్యాలీ నిర్వహించలేదని, ర్యాలీ నిర్వహించినట్టు అక్రమంగా కేసు బనాయించారన్నారు. తాలూకా ఎస్సై నరసింహమూర్తి అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల ఒత్తిడితో తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. నోటీసులు ఇచ్చినట్టు, వాటిని తీసుకోనట్టు చిత్రీకరించి ఎస్సై నరసింహమూర్తి కేసు బనాయిం చారన్నారు. ఉపసర్పంచ్ ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎస్సై తన కుమారుడిపై దాడి చేసి కేసు నమోదు చేశారన్నారు. మాజీ సర్పంచ్ వాలిశెట్టి బాబు మాట్లాడుతూ, అక్రమ కేసులపై జిల్లా ఎస్పీని కలిశామన్నారు.