అగ్నిప్రమాదం మృతులకు ప్రధాని రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , First Publish Date - 2021-03-09T15:31:52+05:30 IST

కోల్‌కతాలోని 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి..

అగ్నిప్రమాదం మృతులకు ప్రధాని రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  స్ట్రాండ్ రోడ్డులోని ఈస్ట్రన్ రైల్వే భవంతిలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు రైల్వే సిబ్బంది, ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సహా తొమ్మిది మంది మృతి చెందారు.


రూ.10 లక్షలు ప్రకటించిన మమత

కాగా, ప్రమాద స్థలికి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చెలరేగడంతో 6.30 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి.

Updated Date - 2021-03-09T15:31:52+05:30 IST