మరోమారు తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లీ.. పడిక్కల్ అర్ధ సెంచరీ

ABN , First Publish Date - 2020-09-29T02:16:08+05:30 IST

రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. అరోన్ ఫించ్ (52) అవుటైన తర్వాత మైదానంలో

మరోమారు తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లీ.. పడిక్కల్ అర్ధ సెంచరీ

దుబాయ్: రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. అరోన్ ఫించ్ (52) అవుటైన తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. 11 బంతులు ఎదుర్కొన్నకోహ్లీ కేవలం 3 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు ఈజీ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


మరోవైపు, క్రీజులో కుదురుకున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరోమారు బ్యాట్ ఝళిపించడం మొదలుపెట్టాడు. వరుస సిక్సర్లు బాది ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో పడిక్కల్‌కు ఇది రెండో అర్ధ సెంచరీ. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిశాయి. ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పడిక్కల్  54, ఏబీ డివిలియర్స్ 20 పరుగులు చేశాడు. 

Updated Date - 2020-09-29T02:16:08+05:30 IST