ఓటమి అనంతరం పాక్ ఓపెనర్ రిజ్వాన్‌ను హగ్ చేసుకున్న కోహ్లీ.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-10-25T21:04:40+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. భారత జట్టు

ఓటమి అనంతరం పాక్ ఓపెనర్ రిజ్వాన్‌ను హగ్ చేసుకున్న కోహ్లీ.. వీడియో వైరల్

దుబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. కోహ్లీసేన నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని ప్రత్యర్థి పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది.


టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం పాకిస్థాన్‌కు ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఐదు వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. అలాగే, ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు ప్రపంచకప్ మ్యాచుల్లో 12సార్లు పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించింది.




మ్యాచ్ ఓడిన తర్వాత కాస్తంత నిరాశ చెందినప్పటికీ టీమిండియా సారథి కోహ్లీ చక్కని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. పాకిస్థాన్ ఓపెనర్లను అభినందించిన కోహ్లీ.. మొహమ్మద్ రిజ్వాన్‌ను హగ్ చేసుకుని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘దటీజ్ కోహ్లీ’ అంటూ అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2021-10-25T21:04:40+05:30 IST